తాడేపల్లి నివాసంలో గౌరవ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను కలిసిన అంతర్ రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకు ఈ అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషం. నలభైమూడు సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుగా నా ప్రస్ధానం మొదలైంది. ఐజెయు అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను. 2014 డిసెంబరు 1 నుంచి 4th ఎస్టేట్ ద్వారా చాలా ప్రముఖత సంపాదించాను. నాకు అప్పగించిన బాధ్యత గురుతరమైనది, శులభమైనది కాదు. ఇరవైనాలుగు గంటలూ మీడియా వ్యవహారాలకు నేను అందుబాటులో ఉంటాను. వ్యక్తిగతంగా నేను అందరు మీడియా మిత్రులను కలుస్తాను. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చేస్తాను. మీడియాలో కావలసిన అన్ని మార్పులు వచ్చేలా చేస్తాను. జర్నలిస్టుల సమస్యలు నేను ముందుగా పట్టించుకుంటాను