ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళనకు పిలుపు ఇచ్చింది. అయితే ఆందోళనలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తోంది. ఇందులో భాగంగా పోలీసులు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని గృహ నిర్బంధం చేశారు. ఆందోళనను ఉధృతం చేస్తామని చింతమనేని ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు చింతమనేని గృహనిర్బంధం చేశారు. దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అలాగే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్టు చేశారు.