ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఓ రైలు పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్లోని మూడో నంబరు ఫ్లాట్ ఫారమ్ మీదకి వస్తుండగా రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.