గ్రామ వాలంటీర్లు జాగ్రత్తగా పని చేయాలని… తప్పులు చేసిన వారిని విధుల నుంచి తొలగిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. కొత్తగా నియమితులైన గ్రామ వాలంటీర్లను ఉద్దేశిస్తూ మంత్రి బొత్స కీలక సూచనలు చేశారు. గ్రామ వాలంటీర్లు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని… ప్రజా సేవకులని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని అన్నారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రతి గ్రామ వాలంటీర్ 50 కుటుంబాల చొప్పున బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని… బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.