అమరావతి : ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద డ్రోన్లు ఎగురవేయడానికి తామే అనుమతి ఇచ్చామని ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. వరద పరిస్థితిపై అంచనా వేయడానికి డోన్ల ద్వారా వీడియోలను తీసుకున్నామని ఇరిగేషన్ శాఖ పేర్కొంది. తన నివాసం వద్ద డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.