హైదరాబాద్ : పీవీ సింధు ప్రపంచ రెండో ర్యాంకు సాధించడం సంతోషకరమని గోపిచంద్ అన్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అభినందనసభ నిర్వహించారు. ఈసందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. పీవీ.సింధు, సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్లను గోపీచంద్ అభినందించారు. తెలుగు క్రీడాకారిణులందరూ రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులకు ఐడీబీఐ చెక్కులు పంపిణీ చేసింది.