టీడీపీ ట్రాక్ లో పడకుండా రాష్ట్రానికి బిజెపి సహకరించాలని, సంక్షేమ పథకాలు అమలులో పోరపాట్లు సర్వసాదరణమేనన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య వ్యాఖ్యలు చేసారు . అవినీతిని పెంచి పోషించిన చంద్రబాబు…దివాళాలో ఉన్ళ రాష్ట్రాన్ని గాడిలో పెట్టె ప్రయత్నం సిఎం జగన్ చేస్తున్నారని ..టీడీపీ వదిలేసిన ప్రాజక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ విధి విధానాలకు కొంత మేర సమయం అవసరమని , పిపిఎ, కాంట్రాక్టుల వల్ల ప్రజలు నష్ట పడటంలేదన్నారు. ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో చెప్పే అర్హత బాబుకు లేదని,కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోని మద్దతు ఇచ్చామన్నారు.. ప్రత్యేక హాదా ఇస్తామని హమీ ఇచ్చిన మోడినే హాదాపై స్పష్టత ఇవ్వాలని,ఎకనామిక్ టెర్రరిస్టులను పార్టీలో చేర్చుకుంటే బిజెపి ఇబ్బందులు పడక తప్పదన్నారు. నాడు బాబును తప్పుపట్టి ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలను బిజెపి లో చేర్చుకోవడం పద్దతి కాదని, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతే నష్టపోయోది ప్రజలా…హైదరాబాద్ లో బూస్ట్ క్రియేట్ చెయ్యడం వల్ల లాభపడిం దెవరని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వ నాశనం చేసిన చంద్రబాబు..రాజధాని విషయంలో కూడా దళారులను పెంచి పోషించారన్నారు. అరాచక పనులను అరికట్టం కోసమే అధికారంలోకి వచ్చామని, రాష్ట్రాభివృద్ది ఆగలేదాని, చంద్రబాబు దోపిడి ఆగిందన్నారు. బాబు అనుమతి లేకుండా రాజ్యసభ సభ్యులు బిజెపి లో చేరారా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతులను దగా చేసిన బాబు…తెలంగాణలో పార్టీ రూపు లేకుండా చేసారన్నారు. దోపిడీ వ్యవస్థను రూపుమాపామని రామచంద్రయ్య దుయ్యబట్టారు.