టిటిడి గార్డెన్ విభాగం ఆధ్యర్యంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. గార్డెన్ విభాగానికి చెందిన 85 మంది సిబ్బంది, 1.5 టన్నుల పుష్పాలతో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.
ఇందులో అపిల్, ద్రాక్ష, దానిమ్మ, బత్తయి, పైనిపిల్ వంటి సాంప్రదాయ ఫలలు, వివిధ సాంప్రదాయ పుష్పలతో వ్రత మండపాన్ని సర్వంగా సుందరంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, క్రింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్వర్ణరథోత్పవం
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్సేవను టిటిడి రద్దు చేసింది.