కేరళలో కొచ్చిన్ విమానాశ్రయాన్ని ఈనెల 11 వరకు మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అక్కడ కురుస్తున్న భారీవర్షాలతో ఇప్పటికే తొమ్మిది జిల్లాలలో రెబ్ అలర్ట్ ప్రకటించగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతుందని, ఈనెల 11 వరకు అదే పరిస్థితి ఉంటుందని, అందుకే విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. హైదరాబాద్-కొచ్చిన్ ప్రయాణికులు ఎయిర్ లైన్స్ సంస్థలను సంప్రదించాలని అధికారులు తెలిపారు.