జార్ఖండ్లోని కుంతి జిల్లాలో ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తోల్కోబేరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, రైఫిల్, డబుల్ బ్యారెల్ గన్, ఏకే-47ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక 10 మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాస్బుక్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.