ట్రెండింగ్
Epaper    English    தமிழ்

315 పునరావాస కేంద్రాల ఏర్పాటు : పినరాయి విజయన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2019, 02:52 PM

కేరళలో భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదల వల్ల నిరాశ్రయులైన వారికి సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 315 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ చెప్పారు. ఇప్పటి వరకూ 22 వేల మందిని ఆ శిబిరాలకు తరలించామని ఆయన చెప్పారు. వారిలో ఎక్కువమంది వయనాడ్‌ జిల్లాకు చెందినవారు ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 మంది మరణించారని ఆయన చెప్పారు. శనివారం నాటికి వర్షాల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ నెల 15 తరువాత మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com