కేరళలో భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదల వల్ల నిరాశ్రయులైన వారికి సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 315 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పారు. ఇప్పటి వరకూ 22 వేల మందిని ఆ శిబిరాలకు తరలించామని ఆయన చెప్పారు. వారిలో ఎక్కువమంది వయనాడ్ జిల్లాకు చెందినవారు ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 మంది మరణించారని ఆయన చెప్పారు. శనివారం నాటికి వర్షాల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ నెల 15 తరువాత మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన చెప్పారు.