మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో బీజేపీ నాయకత్వ బలోపేతం కోసం కృషి చేస్తోందన్నారు. ఈ సమయంలో ఎవరొచ్చినా స్వగతిస్తామన్నారు. గతంలో గంటాపై రాజకీయ విమర్శలే చేశానన్నారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా నీతి నిజాయితీతో పనిచేస్తారన్నారు.