గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాల గుర్తింపు తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ… అన్ని వసతులు ఉన్నాయా ? లేదా ? చూసుకోవాలన్నారు. కంప్యూటర్ పెట్టాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, స్కానర్ ఉండాలి, ప్రింటర్ ఉండాలన్నారు. దరఖాస్తు పెట్టిన 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్ కార్డు ఇచ్చేట్టు ఉండాలన్నారు. గ్రామ సెక్రటేరియట్ మనం పెట్టిన తర్వాత అడిగిన వారికి అడిగిన కార్డు ఇచ్చేట్టు ఉండాలన్నారు. ఇలా అయితేనే గ్రామ సచివాలయానికి ఒక అర్థం వస్తుందన్నారు. అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో గ్రామ సచివాలయం నిలుస్తుందన్నారు. ప్రతి కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలన్నారు. ప్రజలు సంతృప్తికరంగా ఉండాలని, సంతృప్త స్థాయిలో పథకాలు అమలు జరగాలని సీఎం జగన్ అన్నారు.