కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్యా బలం లేదని బిజెపి నాయకురాలు శోభా కరాండ్లజే అన్నారు. వారిది మైనారిటీ ప్రభుత్వమని ఆమె చెప్పారు. ఈ ప్రభుత్వం పడిపోతుందని తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఆమె అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని ఆమె అన్నారు. ప్రజలు విసుగు చెందిపోయారని, ఎమ్మెల్యేలు విసుగు చెందారని ఆమె అన్నారు.