విద్యుత్ కొనుగోలు చేసేందుకు నాలుగేళ్లలో రూ.5497కోట్లు ఎక్కువగా కేటాయించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యుత్ పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం మాట్లాడుతూ… పీపీఏల్లో విపరీతమైన స్కాం జరిగిందని ఈ లెక్కలు చూస్తే తెలుస్తోందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉందన్నారు. ఈలోగా అధికారులపై చంద్రబాబు తన అక్కసును చూపిస్తున్నారన్నారు. కుక్క తోక వంకర అన్న విధంగా ప్రతిపక్షం తీరు ఉందన్నారు.