పరాయి స్త్రీపై వ్యామోహంతో వ్యక్తిని హత్య చేయించి, జీవితఖైదు పడగా, గతవారంలో శిక్షను అనుభవించేందుకు జైలుకు వెళ్లి, ఆపై గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దోశ కింగ్, ప్రఖ్యాత హోటల్ చైన్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ మరణించారు. చెన్నైలోని అసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారని, పరిస్థితి విషమించి మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో తన వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని పెళ్లాడితే, మరింత కలిసి వస్తుందని నమ్మి, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన రాజగోపాల్ కథ ముగిసింది.