బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయనీ, వాటిని మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయనీ సందర్భంగా ఆరోపించారు.