ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పూత్(ఎంఎస్ ధోనీ ఫేం) ఒక విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ఇటలీ బ్రాండ్ అయిన మసరెటీ క్వాట్రోపోర్ట్ సెడాన్ను కొనుగోలు చేశాడు. దీని ఫొటోలను ఇటీవల ఫేస్బుక్లో అభిమానులతో పంచుకున్నాడు. తాను ఈ మోడల్ కారు బొమ్మతో చిన్నప్పటి నుంచి ఆడుకున్నానని ఇప్పుడు అలాంటి కారునే సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.సహజంగానే సుశాంత్ బైకులు, కార్లను ఎక్కువగా ఇష్టపడతాడు. ఇప్పటికే అతని వద్ద రేంజ్ రోవర్ ఎస్యూవీ, బీఎండబ్ల్యూ కె1300ఆర్ మోటార్ సైకిల్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన గ్యారేజీలోకి మాసరెటీ క్వాట్రోపోర్టు కూడా చేరింది.మాసరెటీ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం భారత్లో విక్రయించే అత్యంత అందమైన స్పోర్ట్స్ కార్లలో ఇది కూడా ఒకటి. దీని పోటీ కార్ల అన్నిట్లోకి ఇదే అత్యంత తేలికైంది. దీనిలో ఫెరారీ 3.8 లీటర్ వీ8 ఇంజిన్ ఉంది. ఇది 650 ఎన్ఎం టార్క్ వద్ద 530 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో 8స్పీడ్ గేర్బాక్స్ ఉంది. ఇది కేవలం 4.7 క్షణాల్లో 0-100 వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్స్పీడ్ గంటకు 307 కిలోమీటర్లు..!