కర్ణాటక ప్రభుత్వం రాజకీయ సంక్షభం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించేలా ఆదేశించాలని కోరుతూ మరోసారి సుప్రీం కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 1030 గంటలకు తీర్పు వెలువరించనుంది.