ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్చెన్నాయుడి పై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 11:41 AM

ఎపి శాసన సభలోని బడ్జెట్‌ సమావేశం వాడివేడిగా జరిగింది. మంగళవారం సభ ప్రారంభమవగానే తమ తరపున మాట్లాడే అవకాశం అచ్చెన్నాయుడికి ఇవ్వాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ను మాజి సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా త్వరగా ముగించాలంటూ.. తమ్మినేని సూచించారు. ' నేను సబ్జెక్టుకే వస్తున్నా.. లేదంటే మీరు రాసివ్వండి నేను చదివేస్తా ' అని అచ్చెన్నాయుడు అనడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ' మీరు చెప్పండి. నేనే చదువుతాను. ఏం మాట్లాడుతున్నారు.. ఇదేమైనా బజారు అనుకుంటున్నారా ' అంటూ.. స్పీకర్‌ మండిపడ్డారు. ఇలా వ్యవహరిస్తే సభ నడపడం చాలా కష్టమవుతుందని సీతారాం వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు సభ సంప్రదాయాలు మర్చిపోయారని, స్పీకర్‌ ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని వైసిపి సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com