ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఇంటర్‌ ఫలితాలు

Andhra Pradesh Telugu |   | Published : Wed, Apr 12, 2017, 07:52 AM

 అమరావతి: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఈనాడు ప్రతిభ.నెట్‌, ఈనాడు.నెట్‌, నెట్‌బడి, మనబడి, స్కూల్స్‌9, ఇతర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈసేవా, మీ సేవా, రాజీవ్‌ సిటిజన్‌, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చునని సూచించారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటికే ఇంటర్‌ విద్యా మండలి అందచేసిన ఐడీ, పాసువర్డ్‌ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com