న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి సిద్దరామయ్య శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చిన సమస్యేమి లేదన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాళ్ల(బీజేపీ) ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అయినా వారు ఆ విషయంలో ఎప్పటికీ విజయం సాధించలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.