పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. పాక్ జట్టుకు సలహాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయానన్నాడు. మాంచెస్టర్లో భారత్పై పాక్ ఓడిన తీరుపై వసీం రియాక్ట్ అయ్యాడు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించాడు. అయిదుగురు స్పెషలిస్టు బౌలర్లతో మ్యాచ్కు వెళ్తున్నప్పుడే.. టాస్ గెలిచిన తర్వాత ఎలా బౌలింగ్ను తీసుకున్నారని వసీం ప్రశ్నించాడు. మాంచెస్టర్ వన్డేలో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అయితే ఆ మ్యాచ్లో పాక్ అయిదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగింది. పాక్ చేస్తున్న తప్పులను చూసి ఆ జట్టును విమర్శించడం మానేసినట్లు చెప్పాడు. అయిదుగురు బౌలర్లు ఉన్నారంటే, ఓ స్పెషలిస్టు బ్యాట్స్మెన్ను మనం మిస్సవుతున్నామన్నట్లే, అలాంటి సమయంలో బౌలింగే మన బలం, అప్పుడు మనం టార్గెట్ ఇచ్చి డిఫెండ్ చేయాలన్నాడు. ఇలాంటి సలహాలు ముందు నుంచే ఇచ్చానని, కానీ పాక్ జట్టు తన సలహాలను స్వీకరించలేదన్నాడు. గతంలో లాంకిషేర్ కౌంటీకి వసీం ఆడాడు. ఇక్కడ కండీషన్స్ అతనికి బాగా తెలుసు. కానీ తన సలహాలను పాక్ తీసుకోలేదన్నారు. పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్తో మ్యాచ్కు ముందు ఓ ట్వీట్ చేశారు. ఒకవేళ పాక్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలన్నారు. కానీ ఇమ్రాన్ సలహాను కూడా పాక్ జట్టు పాటించలేదు.