అమరావతి: సుస్థిర పాలన అందించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అని వైసీపీ సభ్యుడు జోగి రమేష్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ పరిపాలన చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు ప్రజలు గుర్తొచ్చారని విమర్శించారు.