దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన గళం వినిపించారు. బెంగాల్ ఘటనకు నిరసనగా ఇవాళ సుమారు పదివేల మంది డాక్టర్లు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోల్కతాతో పాటు వివిధ నగరాల్లో నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కింద ఉన్న డాక్టర్లంతా ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో జరగాల్సిన భేటీకి హాజరుకావడం లేదంటూ జూనియర్ డాక్టర్లు ఓ ప్రకటన చేశారు. మీడియా కవరేజీకి అనుమతి ఇవ్వకపోవడంతో డాక్టర్లు సీఎంతో జరిగే సమావేశానికి వెల్లడం లేదన్నారు. కోల్కతాలోని ఓ హాస్పటల్లో గాయపడ్డ డాక్టర్ పారిభా ముఖర్జీ ప్రస్తుతం కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. కోల్కతాకు చెందిన న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ తన మెడికల్ బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
బెంగాల్లో వైద్య సేవలు నిలిచిపోవడం వరుసగా ఇది ఆరవ రోజు. అయితే వైద్యుల ఆందోళనకు మద్దతుగా తమిళనాడులోని డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు. డాక్టర్ల సమ్మెలో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ హాస్పటల్ కూడా పాల్గొన్నది. కర్నాటక, తమిళనాడులోని ప్రభుత్వ హాస్పటళ్లు ఆందోళనకు దూరంగా ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు హాస్పటళ్లు మాత్రం సమ్మెలో పాల్గొంటున్నాయి. డాక్టర్లపై దాడిని కర్నాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఖండించారు. తెలంగాణలో డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన వ్యక్తం చేస్తున్నారు.