ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు దొంగ‌లు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2017, 04:13 PM

  విశాఖ: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు దొంగలను విశాఖ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నగరంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని నరేశ్‌ అలియాస్‌ స్పైడర్‌ మ్యాన్‌ దొంగతనాలకు పాల్పడేవాడు. తాను దొంగిలించిన వస్తువులను స్నేహితుడు ఎల్లాజి ద్వారా అమ్ముకుని సొమ్ము చేసుకునేవాడు. అలా వీరు దొంగతనాలకు అలవాటు పడి జైలుకు వెళ్లి వస్తుండేవారు. ఈ ఏడాదిలో మూడిళ్లలో దొంగతనాలకు పాల్పడి శుక్రవారం పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 280 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నగరంలో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు బాల నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 12 బైక్‌లు, ఓ టీవీ, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com