ఆంధ్రప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తంతో పాటు ప్లేస్ ను కూడా నిర్ణయించేశారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందుగా తిరుపతిలో తారకరామ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న చివరికి విజయవాడలోనే ఫైనల్ చేసారు. ఇక జగన్ తో పాటుగా పూర్తి స్థాయి కేబినెట్ సైతం ప్రమాణ స్వీకారం ఆ రోజు చేయనున్నట్లు తెలుస్తోంది.
ముందునుంచీ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చాలా ధీమాగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ అధినాయకత్వం ఈ ఫలితాలను ముందే ఉహించమని చెబుతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లును ఘనంగా చేయబోతున్నారు. ఇప్పటికైతే వైయస్ఆర్ సీపీ పార్టీ 76 స్థానాల్లో గెలవగా… 74 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం..ఈనాడే ఎదురౌతునట్లు.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు మరియు అభిమానాలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.