న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి అతిషీ స్వల్ప తేడాతో వెనుకంజలో ఉన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో ముందంజలో ఉన్నారు. టీఎంసీ నుంచి పోటీచేస్తున్న సినీనటి మూన్మూన్సేన్ వెనుకంజలో ఉన్నారు. సీపీఎం తరఫున గౌరంగా చటర్జీ, కాంగ్రెస్ టికెట్పై బిశ్వరూప్ మండల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ, తృణమూల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది.