వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమెథీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనకంజలో ఉండగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్లో రాహుల్ లక్ష ఓట్ల ఆధిక్యతకు దగ్గరగా కొనసాగుతున్నారు. అమెథిలో రాహుల్ గాంధీపై 2వేల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ముందజలో ఉన్నారు.