విజయవాడ, సూర్య బ్యూరో : నవ్యాంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరైందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరశింహన్కు ఆదివారం ఘనస్వాగతం లభించింది. ఆదివారం గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్కు స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఇన్ఛార్జి కలెక్టర్ గంథం చంద్రుడు, డిసిపి ట్రాఫిక్ టి.కె.రాణా తదితరులున్నారు. అనంతరం గవర్నర్ హెలికాప్టర్ ద్వారా వెలగపూడి బయలుదేరి వెళ్ళారు.