విజయవాడ, సూర్య బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఇగ్నో విద్యార్థు ల సంఖ్య బాగా పెరిగేలా ఈ స్టడీ సెంటర్ల వారు, రీజనల్ సెంటర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఇగ్నో లక్ష్యమని ఇగ్నో రీజినల్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ డాక్టర్ వి.వేణుగోపాలరెడ్డి అన్నారు. అతి మూరుమూల ప్రాంతాల్లో నివాసం వుంటున్న ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందించాలనేది ఇగ్నో లక్ష్యమని ఆయన అన్నారు. ఆదివారం నగరంలో ఇగ్నో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ రీజనల్ సెంటర్లు, స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగు విద్యార్థుల కోసం ఈఏడాది నుంచి కొన్ని కోర్సులను తెలుగులో కూడా రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు వీలైనంత వరకు మంచి సర్వీసులను అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీంట్లో భాగంగా డిజిటలైజేషన్, ఆన్లైన్ అడ్మిషన్లు, ఇతర కార్య క్రమాలు నిర్వహిస్తామ న్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని గ్రామీ ణ, సెమీ అర్బన్ ప్రాంతా లతో పాటు అతి మూరుమూల ప్రాంతాల్లో నివాసం వుంటున్న ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల విద్య అందితే రెండు తెలుగు రాష్ట్రాలు మంచి అభివృద్దిని సాధించగలవని అన్నారు. ఉన్నత విద్యా భ్యాసం చేసే అవకాశం లేని విద్యార్దులు, వయోజనుల కోసం ఈ విశ్వ విద్యాలయం ప్రత్యేకంగా పనిచేస్తుం దన్నారు. కోర్సుల్లో ప్రవేశాలు, మెటీరియల్ పొందటం, ఫీజులు చెల్లింపు, పరీక్ష దరఖాస్తులు సమర్పణతో అన్ని సేవల్ని తన వెబ్సైట్ ద్వారా నిర్వహించే వీలు కల్పిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇగ్నో డైరక్టర్ ప్రొఫెసర్ సలూజ, కృష్ణా యూనివర్శిటీ నూజివీడు పిజి సెంటర్ ప్రొఫెసర్మండవ బసవేశ్వరరావు, ఇగ్నో విశాఖపట్నం రీజనల్ డైరక్టర్ డాక్టర్ రాజారావు, ఇగ్నో విజయవాడ రీజనల్ డైరక్టర్ డాక్టర్ శర్మ, అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జి.ప్రసాద్బాబు, కెబిఎన్కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల నుంచి 70మంది ఇగ్నోకు చెందిన వారు హాజరయ్యారు.