విజయవాడ, సూర్య బ్యూరో : ఎపిబిసి సంఘం (ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్క్లాస్ సంఘం) వార్షిక విస్తృతస్థాయి సమావేశం నగరంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ర్ట వడ్డెర సేన నూతన కమిటీ ఎన్నికతోపాటు మ్యాట్రిమోని వెబ్సైట్ను ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్పిఎఫ్ డిఐజీ యేసురత్నంచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా యేసురత్నం మాట్లాడుతూ పేదవాళ్ళు, బడుగు, బలహీనవర్గాల తదితర వర్గాల వివాహ సంబంధాల కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిబిసిమ్యాట్రి.కామ్ ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని దీనిద్వారా మారుమూల ప్రాంతాల వారికి కూడా ఇది అనుసంధానంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉభయ రాష్ట్రాల్లోని తెలుగువారు ఉచితంగా వినియోగించుకోవచ్చన్నారు. ఎపి బిసి సంఘం రాష్ర్ట అధ్యక్షులు దేరంగుల ఉదయ్కిరణ్ మాట్లాడుతూ అణగారిపోతున్న పేద, బడుగు బలహీనవర్గాల కులాలను పరిరక్షణ కల్పించి, అభివృద్ధికి తీసుకొని రావటమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని, అసెంబ్లీ సమావేశంలో బిసి కులాలను తగిన బడ్జెట్ కేటాయించబడలేదని అదే విధంగా ప్రతి కుల ఫెడరేషన్లకు కనీసం 200 కోట్లు నిధులు కేటాయింపు, ఎస్టీ జాబితాలోకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వడ్డెర, రజక, వాల్మీకి, బెస్తా, గాండ్ల, కురుభ కులాలను చేర్చుతామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్గ చేశారు. బిసిలకు విద్య, ఉద్యోగ, ప్రమోషన్ రాజకీయ రిజర్వేషన్ 33 శాతం చేసిన రిజర్వేషన్ను అసెంబ్లీలో ఆమోదించినప్పటికీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి తక్షణమే చట్టబద్దత కల్పించాలన్నారు. వడ్డెర కులానికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి గవర్నర్ కోటాలో వడ్డెరలకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరారు. ఎపి వడ్డెర సేన రాష్ర్ట కమిటీ ఆవిర్భావం ద్వారా ‘వడ్డెర సేన’ వడ్డెరల హక్కుల సాధన కోసం, వడ్డెరలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి అయ్యేవరకు పోరాటం చేస్తుందని, వడ్డెరలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ఈ వడ్డెరసేన సిద్దంగా వుంటుందన్నారు. అదే విధంగా కులాలకు, మతాలకు అతీతంగా పేదవాళ్ళకోసం ఉచితంగా వివాహాలు కుదుర్చుకోవడానికి వెబ్సైట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ నూతన కమిటీలో రాష్ర్ట కన్వీనర్ బత్తుల హరిప్రసాద్ (అనంతపూర్జిల్లా), రాష్ర్ట జాయింట్ కన్వీనర్లు తమ్మిశెట్టి చక్రవర్తి (కృష్ణాజిల్లా), పల్లపు రవికిషోర్ (గుంటూరు జిల్లా), రాఘవన్ (కడపజిల్లా), తన్నీరు సురేష్ (చిత్తూరుజిల్లా), గౌరవ సలహాదారులుగా బండారు హాసన్ (తూర్పు గోదావరిజిల్లా), తమ్మిశెట్టి వెంకటస్వామి (విజయవాడ)లున్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఎం.నారాయణస్వామి, ఎపిబిసి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ.డి.కామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.