అమరావతి : వైకాపా సభ్యులు స్పీకర్ స్థానాన్ని చుట్టుముట్టి నినాదాలు కొనసాగిస్తున్నారు. స్పీకర్ పదేపదే విపక్ష సభ్యులను తమతమ స్థానాలలోనికి వెళ్లి కూర్చోవాలని విజ్ణప్తి చేసినప్పటికీ వారు వినలేదు. మంత్రులు యనమల, ప్రత్తిపాటి, విప్ కాల్వ, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తదితరులు విపక్ష సభ్యుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శించారు.