ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీజేఐ కుట్రపై మాజీ జడ్జితో విచారణ

national |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2019, 06:03 PM

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరికించేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగిందనే కోణంపై విచారణ జరిపించేందుకు సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి పట్నాయక్‌ను నియమించింది. ఈ విచారణకు సహకరించాల్సిందిగా సీబీఐ, నిఘా విభాగం డైరెక్టర్లు, ఢిల్లీ పోలీసు కమిషనర్లను కోరింది. నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాల్సిందిగా ఆదేశించింది. సీజేఐపై కొందరు కక్షగట్టి ఈ లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని న్యాయవాది ఉత్సవ్ బైన్స్ అఫిడవిట్‌ను దాఖలుచేసిన విషయం విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com