సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ను లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరికించేందుకు భారీ ఎత్తున కుట్ర జరిగిందనే కోణంపై విచారణ జరిపించేందుకు సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి పట్నాయక్ను నియమించింది. ఈ విచారణకు సహకరించాల్సిందిగా సీబీఐ, నిఘా విభాగం డైరెక్టర్లు, ఢిల్లీ పోలీసు కమిషనర్లను కోరింది. నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాల్సిందిగా ఆదేశించింది. సీజేఐపై కొందరు కక్షగట్టి ఈ లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని న్యాయవాది ఉత్సవ్ బైన్స్ అఫిడవిట్ను దాఖలుచేసిన విషయం విదితమే.