శ్రీలంకలోఉగ్రదాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. 6చోట్ల మారణహోమంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి. పవిత్ర ఈస్టర్ నాడే పెను విషాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. 200మంది పైగా మృతి, అంతకు రెండు, మూడు రెట్లు గాయాల పాలుకావడంపై దిగ్భ్రాంతి. శ్రీలంక పర్యటనలో ఉన్న అనంతపురం వాసుల క్షేమంపై ఆరా తీశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చ. ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.