శ్రీలంక: కొలంబో సహా పలుచోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని రెండు ప్రార్థనా మందిరాల్లో, హోటల్స్ను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. బాంబు పేలుళ్లలో 25 మంది మృతి చెందగా 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాడు. పరిసర ప్రాంతాల్లోని భవనాలకు పగుళ్లు వచ్చాయి.