ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ శనివారం తన కార్యాలయంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు వంటి మహానాయకుని సేవలు ఎపీకే కాకుండా, దేశానికి కూడా ఎంతో అవసర మన్నారు. భవిష్యత్లో చంద్రబాబు దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. సీఎం పని తీరు గుర్తించిన ప్రజలు ఎపీలో మరోసారి టీడీపీకే కట్టనున్నారని అభిప్రాయపడ్డారు. దేశంలో కూడా బీజేపీయేతర కూటమే అధికారంలోకి వస్తుందని తెలిపారు.