ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సేవలో జస్టిస్‌ గొగోయ్‌ దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2019, 09:35 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దంపతులు శుక్రవారం వేకువజామున దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొనడానికి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, ఆయన సతీమణి రూపాంజలి గొగోయ్‌లకు తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు డాలర్‌ శేషాద్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారికి ఆకాశగంగ జలాలతో నిర్వహించే అభిషేకసేవలో వారు పాల్గొని, శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనంతో జస్టిస్‌ గొగోయ్‌ దంపతులకు స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ఈవో బహూకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com