వడోదరా : రయీస్ సినిమా ప్రమోషన్స్ సమయంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై వివరణ ఇవ్వాలని రైల్వే పోలీసులు షారుక్ఖాన్కి, చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్కి సమన్లు జారీచేశారు. వడోదరా రైల్వే స్టేషన్లో రయీస్ ప్రమోషన్స్ సమయంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరుగగా ఫహ్రీద్ఖాన్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జ్యాడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలమేరకు షారుక్కి, చిత్ర సహ నిర్మాతకు సమన్లు జారీచేశామని, వాంగ్మూలం ఇచ్చేందుకు వారికి ఏడు రోజుల గడువు ఇచ్చామని రైల్వే శాఖ డిప్యూటీ ఎస్పీ తరుణ్బరోత్ వెల్లడించారు.