చెన్నై: ఆర్ కే నగర ఉప ఎన్నికల్లో స్థానిక ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంపిణి చెయ్యడానికి రంగం సిద్దం అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. ఎలాగైనా ఆర్ కే నగర్ నియోజక వర్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్న నాయకులు కోట్ల రూపాయలు కుమ్మరించడానికి సిద్దం అయ్యారని తెలిసింది.పలు పార్టీల నాయకులు ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ప్రజలకు రూ. 50 కోట్ల వరకు డబ్బు పంపిణి చెయ్యడానికి సిద్దం అయ్యారని ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది.