ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళనకు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ దగ్గర కాసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. రైతుల డిమాండ్లను తాము విన్నామని, త్వరలో కేంద్ర హోంమంత్రి, వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తీవ్ర కరువుతో తమిళనాడులో అన్నదాతల పరిస్థితి దయనీయంగా ఉందని, వెంటనే కేంద్రం స్పందించి కరువు సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నారు.