ఏపీ అసెంబ్లీలో గందరగోళం ఆందోళన మధ్య కీలక బిల్లులకు ఆమోదం అధికారులకు రక్షణ కల్పించాలంటూ వైసీపీ ఆందోళన ఏపీ అసెంబ్లీలో 12 బిల్లులు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అధికారులకు రక్షణ కల్పించాలని కోరుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. అయితే, వైకాపా సభ్యుల ఆందోళన మధ్య పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
(వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి ) : అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ వర్సిటీ బిల్లు, ఏపీ మౌలిక సదుపాయాల చట్ట సవరణ బిల్లు, ఏపీ వ్యాట్ చట్టసవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక బోర్డు బిల్లు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవ రణ బిల్లు, వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ చట్టసవరణ బిల్లు, రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభా పతి కోడెల సభను మంగళవారానికి వాయిదా వేశారు. అసెం బ్లీలో అధికార, ప్రతిపక్షాల సభ్యుల మధ్య గందరగోళం నెల కొంది. అధికారు లకు రక్షణ కల్పించాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్య ప్రభుత్వం 12 బిలు ్లలకు ఆమోదం తెలి పింది. ఏపీ ఎనర్జీ వర్సిటీ, మ్యారిటైం బోర్డు, లాజిస్టిక్ వర్సిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సవరణ బిల్లు, వ్యాట్, రిజిస్ట్రేషన్, ఆబ్కారీ చట్ట సవరణ బిల్లు, పర్యాటక, సం స్కృతి వారసత్వ బోర్డు బిల్లు, ఎన్జీరంగా వర్సిటీ, వైఎస్ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో