దిల్లీ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై న్యాయస్థానంలో వేసిన పిటిషన్పై నేడు విచారణ చేపట్టింది. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది. కేవలం బ్యాంక్ అకౌంట్లు తెరవడంలాంటి వాటికి ఆధార్ను వాడుకోవచ్చని సూచించింది. ఆదాయపు పన్ను వివరాల నమోదు లాంటి వాటికి మాత్రం ప్రభుత్వం ఆధార్ను తొలగించబోదని న్యాయస్థానం వెల్లడించింది. ఆధార్ అనుసంధానంపై పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావట్లేదని తెలిపింది. అక్రమాలను తొలగించడానికి అన్ని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేస్తోన్న విషయం తెలిసిందే.