విజయవాడ, మేజర్న్యూస్: ఏప్రిల్ 17న మరోసారి గవర్నర్తో సమన్వయ కమిటీ సమావేశం అవుతుందని, ఆ సమావేశంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఆదివారం గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మంు్తల్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాజ్భవన్లో ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంు్తల్రు హరీష్ రావు, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి మంు్తల్రు యనమల రామకృష్ణూడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలతో పాటు 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై మంత్రలు గవర్నర్తో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసిన సచివాలయం, అసెంబ్లీ భవనాలు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం అప్పజెప్పాలని గవర్నర్ను తెలంగాణ మంత్రలు కోరారు. ఈ సమా వేశంలో ఉద్యోగుల విభజనతో పాటు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించా మని పేర్కొన్నారు. సచివాలయం విషయం కూడా చర్చించడం జరిగిందన్నారు.