ఉత్తర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇటీవల బోట్ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 27 నుంచి రైల్ యాత్ర చేపట్టనున్నారు. ఢిల్లీ నుంచి ఫైజాబాద్ వరకు ప్రియాంక గాంధీ రైల్ యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైలు లో ప్రయాణికులతో సంప్రదింపులు జరపాలని ,కాంగ్రెస్ కు ఓట్ చేయాల్సిన ఆవశ్యకతను ప్రియాంక గాంధీ వివరి స్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 27 న ఢిల్లీ నుంచి కైఫియత్ ఎక్సప్రెస్ రైల్ లో ఫైజాబాద్ వరకు ప్రియాంక గాంధీ ప్రయాణిస్తా రని, ఫైజాబాద్ లో కొద్ది సేపు బస చేసిన తర్వాత అయోధ్య కు ప్రియాంక గాంధీ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. అయోధ్య లో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచు 3 రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా అయోధ్య లోని ప్రముఖ హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించి ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫైజాబాద్ నుంచి అమేథీ వరకు 30 కి పైగా ప్రదేశాలలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారని, పలు గ్రామాలలో ప్రజలతో, ప్రత్యేకించి మహిళలతో ప్రియాంక గాంధీ సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు చెప్పాయి.