హిందూపురం: హిందూపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ కు పరిస్థితులు అనుకూలంగా మారలేదు. తన వీఆర్ఎస్ ను ఆమోదించాలని ట్రైబ్యునల్ ఆదేశించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, నామినేషన్లకు తుది గడువు ముంచుకొస్తుండటంతో... తన భార్య సవితను రంగంలోకి దించాలని భావించారు. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం పార్టీ అధినేత జగన్ తో మాధవ్ భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించకపోతే తన భార్యతో నామినేషన్ వేయిస్తానని ఈ సందర్భంగా జగన్ కు చెప్పారు. దీంతో, మాధవ్ భార్య సవితకు బీఫామ్ ఇవ్వాలంటూ పార్టీ నేతలకు జగన్ ఆదేశించారు.