ఢాకా: బంగ్లాదేశ్లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టించింది. ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లో ఆరుగురు మృతి చెందగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్లు శనివారం బంగ్లా రాజధాని ఢాకాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైహెట్లో సంభవించాయి. సూసైడ్ బాంబర్స్ వరుసగా రెండు సార్లు ఢాకా ఎయిర్పోర్ట్ సమీపంలో దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు ఆదివారం ఉదయం మీడియాకు తెలిపారు. సహాయక చర్యలకు పోలీసుల తీవ్రంగా శ్రమిస్తున్నారని క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఢాకా తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇద్దరి పోలీసులు మరణించారని, సుమారు 40 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు.