అమరావతి :రైతుల త్యాగంతోనే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అసెంబ్లి కమిటీ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కొనుగోలు చేయాలంటే 40 వేలకోట్ల భారం పడేదని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాజధానిలో 9 నగరాలు, 27 టౌన్షిప్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైందని, పోలవరం, అమరావతి పూర్తయితే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయన్నారు. రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఆలోచనలను పంచుకోవాలని సీఎం కోరారు. ఈనెల 29వ తేదీన ఏడు ప్రాధాన్య రహదారులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.