ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రదాడి మృతుల జాబితా.. ఆ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 07:59 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. అయితే తాజాగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరి వివరాలను అధికారులు వెల్లడించారు. వారి పేర్లు, ఏ రాష్ట్రానికి చెందిన వారో కూడా తెలిపారు. అయితే మృతుల్లో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన వారే ఉండగా.. వారంతా పురుషులే కావడం గమనార్హం. ఉగ్రవాదులు మహిళలు, పిల్లలను వదిలేసి కేవలం పురుషులను కాల్చి చంపారు. అందుకు కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు.


ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల్లో మహారాష్ట్ర నుంచే ఆరుగురు ఉన్నారు. ఇక గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు చొప్పున చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఒక నేపాలీ కూడా ఉన్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


మృతుల పూర్తి వివరాలు


దిలీప్ దేసాలే - ముంబయి, మహారాష్ట్ర


హేమంత్ జోషి సుహాస్ - ముంబయి, మహారాష్ట్ర


అతుల్ శ్రీకాంత్ మోని - థానే, మహారాష్ట్ర


సంజయ్ లక్ష్మణ్ లేలే - థానే, మహారాష్ట్ర


సంతోష్ జగ్దాలే - పుణే, మహారాష్ట్ర


కస్టోబే గనోవోటే - పుణే, మహారాష్ట్ర


బిటన్ అధికారి - కోల్ కతా, పశ్చిమ బెంగాల్


సమీర్ గుహ - కోల్ కతా, పశ్చిమ బెంగాల్


మనీశ్ రంజన్ (ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్) - పురులియాలోని ఝల్దా, పశ్చిమ బెంగాల్


మధుసూదన్ సోమిశెట్టిరావు - బెంగళూరు, కర్ణాటక


భరత్ భూషణ్ - బెంగళూరు, కర్ణాటక


మంజునాథ రావు - శివమొగ్గ, కర్ణాటక


యతీశ్ పర్మార్ - భావ్ నగర్, గుజరాత్


సుమిత్ పర్మార్ (యతీశ్ కుమారుడు) - భావ్ నగర్, గుజరాత్


సైలేష్ భాయ్ కలథియా - సూరత్, గుజరాత్


వినయ్ నర్వాల్ (నేవీ అధికారి) - కర్నాల్, హర్యానా


ఎన్. రామచంద్రన్ - కొచ్చి, కేరళ


దినేశ్ అగర్వాన్ - చంఢీగఢ్


సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా - పహల్గామ్, జమ్ము కశ్మీర్


నీరజ్ ఉద్వానీ - ఉత్తరాఖండ్


జేఎస్ చంద్రమోళి - విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్


సుశీల్ నాథ్యాల్ - ఇండోర్, మధ్య ప్రదేశ్


ప్రశాంత్ సతపతి - బాలేశ్వర్, ఒడిశా


టేజ్ హాల్వింగ్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్పొరల్) - జిరో, అరుణాచల్ ప్రదేశ్


శుభం ద్వివేది - కాన్పూర్, ఉత్తర ప్రదేశ్


సుదీప్ సోయిపాని - రూపందేవి, నేపాల్


వీరితో పాటు మరో ఇద్దరు మృతులు కూడా ఉన్నప్పటికీ.. వారి గురించి ఆలస్యంగా తెలిసింది. దీంతో వారి వివరాలను అధికారులు వెల్లడించలేకపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com