విజయవాడ, సూర్య బ్యూరో : సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ ఫలాల్ని ఒకే సామాజిక వర్గం అనుభవించాలనే దురు ద్దేశ్యంతో ఎస్సీ వర్గీకరణను కొంత మంది వ్యతిరేకిస్తున్నారని, సైంధ వుల్లా ఎంతమంది అడ్డుపడినా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని ఎపిఎం ఆర్పిఎస్ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.రాజు మాదిగ అన్నారు. శుక్రవారం నగరంలోని ముఖ్యనేతల సమావేశంలో ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ రిజర్వేషన్లు హేతుబద్దీకరణ జరగాల్సిందేనని, ఎస్సీల్లో వున్న ప్రతి ఉప కులానికి రిజర్వేషన్ ఫలాలు అందాలని, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ 5న తిరుపతి నుంచి మాదిగల మహాసంకల్ప చైతన్య రథయ్త్రా ప్రారంభించి, 13 జిల్లాల్లో య్త్రా కొనసాగించి మే 8న విజయవాడ జింఖానా గ్రౌండ్లో వేలాది మంది మాదిగలతో ‘మాదిగల మహా సంకల్ప సభ’ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ అంశంపట్ల సానుకూలంగా స్పందిస్తున్న తరుణంలో రాష్ర్ట ప్రభుత్వం మౌనంగా ఉండడం సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించడ మేనని, వర్గీకరణ అంశంపట్ల ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్గ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎంఆర్పిఎస్ మహిళా రాష్ర్ట అధ్యక్షురాలు రాందేవమణ, యువసేన రాష్ర్ట అధ్యక్షులు దాసరి సువర్ణరాజు, జిల్లా అధ్యక్షులు నల్లూరి శేఖర్బాబు, మహిళా సమైఖ్య రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.విక్టోరియా, ప్రకాశం జిల్లా అధ్యక్షులు సుధాకర్, జిల్లా నాయకులు హేమలత, సలోమి, ఎం. చినలక్ష్మయ్య, ఎం. ఏలియా బాబు, పింగళి శ్రీనివాసరావు, విద్యార్థి విభాగం కృష్ణాజిల్లా నాయకులు పేటేటి రాజు, పెనమలూరు నియోజకవర్గం నాయకులు పులిపాక ప్రవీణ్, గన్నవరం నియోజకవర్గ నాయకులు మోహన్రావు, రాంబాబు, రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.